![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -268 లో..... ప్రేమపై కళ్యాణ్ పగతీర్చుకోవాలనుకుంటాడు. అందుకు ప్రేమకి ఫోన్ చేసి నీ జీవితం ఎలా నాశనం చేస్తానో చూడమని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరొకవైపు ప్రేమ గదిలోకి శ్రీవల్లి వెళ్లి కొరియర్ వెతికి ఓపెన్ చేస్తుంది. అందులో ప్రేమ, కళ్యాణ్ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని చూసి షాక్ అవుతుంది.
అసలు దీని వెనకాల ఏదో రహస్యం ఉందని ఫోటోస్ పట్టుకొని బయల్దేర్తుంది. అప్పుడే నర్మద ఎదురుపడుతుంది. నీకు కొంచెం అయినా సిగ్గుందా.. ప్రేమ గదిలో ఏం చేస్తున్నావని శ్రీవల్లీపై నర్మద కోప్పడుతుంది. ఇదిగో ఫోటోస్ అని తన దగ్గర కొన్ని ఫోటోస్ ఉంచుకొని మిగతావి నర్మదకి చూపిస్తుంది. అవి చూసి నర్మద టెన్షన్ పడుతుంది. ఏంటి మాట పడిపోయిందని శ్రీవల్లి అంటుంది. ఇందులో తప్పేముంది.. వాళ్ళ ఫ్రెండ్ తో ఫోటో దిగిందని నర్మద దబాయిస్తుంది. ఈ విషయం ఎక్కడ చెప్పకని శ్రీవల్లితో నర్మద అంటుంది. ఫోటోస్ అన్నీ తీసుకొని వెళ్లి వేదవతికి చూపిస్తుంది నర్మద. వేదవతి వాటిని చూసి భయపడుతుంది. ఆ కళ్యాణ్ గాడు ఈ ఫోటోస్ తో తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనుకుంటా.. అందుకే ప్రేమ టెన్షన్ పడుతుందని నర్మద, వేదవతి అనుకుంటారు. ఫోటోస్ ని ఇద్దరు కలిసి కాల్చేస్తారు.
అదంతా శ్రీవల్లి చూసి ఫోటోస్ కాల్చేస్తున్నారంటే ఆ రహస్యం ఏంటో వాళ్ళకి తెలుసుకావచ్చు.. ఇక వాళ్ళని భయటపెడుతానని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి కళ్యాణ్ ఫోన్ చేసిన విషయం చెప్తుంది. నువ్వు టెన్షన్ పడకు.. వాడిని వెతికే పనిలో ఉన్నానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ తన ఫ్రెండ్ తో కలిసి రామరాజు దగ్గరికి వస్తాడు. పెన్ డ్రైవ్ తన ఫ్రెండ్ కి ఇచ్చి రామరాజుకి ఇవ్వమంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |